Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ జట్టులో కరోనా కలకలం - మరో ఆటగాడికి పాజిటివ్

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (13:16 IST)
స్వదేశంలో ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఆటగాళ్లను మాత్రం కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరో ఆటగాడికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ జట్టు సభ్యులను క్వారంటైన్‌కు పంపించారు. 
 
నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మంగళవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడాల్సివుంది. ఈ లోపే ఆ జట్టులోని ఓ ఆటగాడికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ మేరకు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో తేలింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం జట్టును ముంబైలో క్వారంటైన్స్‌కు తరలించారు. అయితే, ఆర్టీపీసీ పరీక్ష ద్వారా కూడా కరోనా పాజిటివ్ ఉందా లేదా అని నిర్ధారణ చేయనున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
గత శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హార్‌కు కరోనా పాజిటివ్ ఉన్నట్టు బయటపడడం తెలిసిందే. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ కరోనా వైరస్ కేసులు వెలుగు చూడడంతో 2020లోనూ ఐపీఎల్ సగంలో ఆగిపోవడం గుర్తుండే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు క్వారంటైన్ కాలం 3-4 రోజులకు తగ్గిపోయింది. కనుక మరొక రోజు అయినా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహణకు అవకాశాలు ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

తర్వాతి కథనం
Show comments