Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ - చిత్తుగా ఓడిన ఢిల్లీ

Webdunia
సోమవారం, 9 మే 2022 (07:42 IST)
ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా, ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఫలితంగా ప్రత్యర్థి ఢిల్లీ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసి చెన్నై జట్టు 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ జట్టును 117 పరుగులకే కట్టడి చేయడంతో 91 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లిపోయాయి. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు డెవోన్ కాన్వే మరోమారు చెలరేగాడు. 49 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేయగా రుతురాజ్ గ్వైకాడ్ 41, శివం దూబే 32, ధోనీ 21 చొప్పున పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆ తర్వాత 209 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 117 పరుగులు మాత్రమే చేసింది. 
 
ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ చేసిన 25 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఆ తర్వాత వార్నర్ 19, కెప్టెన్ రిషబ్ పంత్ 21, శార్దూల్ ఠాకూర్ 24 చొప్పున పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments