Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదరగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ - చిత్తుగా ఓడిన ఢిల్లీ

Webdunia
సోమవారం, 9 మే 2022 (07:42 IST)
ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా, ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఫలితంగా ప్రత్యర్థి ఢిల్లీ చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసి చెన్నై జట్టు 208 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ జట్టును 117 పరుగులకే కట్టడి చేయడంతో 91 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లిపోయాయి. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు డెవోన్ కాన్వే మరోమారు చెలరేగాడు. 49 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేయగా రుతురాజ్ గ్వైకాడ్ 41, శివం దూబే 32, ధోనీ 21 చొప్పున పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆ తర్వాత 209 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 117 పరుగులు మాత్రమే చేసింది. 
 
ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ చేసిన 25 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఆ తర్వాత వార్నర్ 19, కెప్టెన్ రిషబ్ పంత్ 21, శార్దూల్ ఠాకూర్ 24 చొప్పున పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments