ధోనీతో తలపడనున్న కోహ్లీ... పోరులో ఎవరు గెలుస్తారు?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:42 IST)
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలు నువ్వానేనా అంటూ తలపడనున్నారు. ఈ పోరులో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇంతకీ వీరిద్దరు ఎందుకు తలపడనున్నారనే కదా మీ సందేహం. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 పోటీల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. మొత్తం షెడ్యూల్ ప్రకటించకుండా కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే వెల్లడించింది. మొదటి మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. వచ్చే నెల 23వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుంది. 
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేసింది. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. ఇక హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో మార్చి 29న ఈ సీజ‌న్ తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్‌తో స‌న్‌రైజ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

తర్వాతి కథనం
Show comments