Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీతో తలపడనున్న కోహ్లీ... పోరులో ఎవరు గెలుస్తారు?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (15:42 IST)
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలు నువ్వానేనా అంటూ తలపడనున్నారు. ఈ పోరులో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఇంతకీ వీరిద్దరు ఎందుకు తలపడనున్నారనే కదా మీ సందేహం. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 పోటీల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. మొత్తం షెడ్యూల్ ప్రకటించకుండా కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే వెల్లడించింది. మొదటి మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. వచ్చే నెల 23వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభంకానుంది. 
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేసింది. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. ఇక హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో మార్చి 29న ఈ సీజ‌న్ తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్‌తో స‌న్‌రైజ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments