Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు

Webdunia
సోమవారం, 25 సెప్టెంబరు 2023 (16:08 IST)
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టంచారు. ఈ క్రీడల్లో ఏకంగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సారథ్యంలోని మహిళా క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. దీంతో ఈ యేడాది జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు రెండు బంగారు పతకాలను చేసుకున్నట్టయిది. అలాగే, ఇప్పటివరకు అన్ని విభాగాల్లో కలిపి భారత ఆటగాళ్లు 11 పతకాలను కైవసం చేసుకున్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత మహిళా జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. జట్టులో స్మృతి మందనా 46, జెమీమా రోడ్రిగ్స్ 42 చొప్పున పరుగులు చేసి రాణించారు. ఆ తర్వాత 117 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 97 పరుగులకే పరిమితమైంది. దీంతో 19 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో టిటాస్ సాధు 4 ఓవర్లు వేసి ఆరు రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. మరో బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ కూడా రెండు వికెట్లు తీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

తర్వాతి కథనం
Show comments