Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ టెస్ట్ మ్యాచ్ : 109 పరుగులకే కుప్పకూలిన భారత్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (15:21 IST)
బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో భారత బుధవారం ఇండోర్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఆపసోపాలు పడి చివరకు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు కునెమన్, లైయన్‌లు విసిరే బంతులను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు తడబడ్డారు. దీంతో 33.2 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. 
 
కాగా, భోజన విరామం సమయానికే 84 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన భారత్.. మిగిలిన మూడు వికెట్లను ఏడున్నర ఓవర్లలో కోల్పోయింది. ఇందులో విరాట్ కోహ్లీ (22), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), ఉమేశ్ యాదవ్ (17), అక్షర పటేల్ (12 నాటౌట్), కెప్టెన్ రోహిత్ శర్మ (12) చొప్పున రెండంకెల స్కోరు చేశారు. పుజారా ఒక్క పరుగు, రవీంద్ర జడేజా నాలుగు, శ్రేయస్ అయ్యర్ సున్నా, అశ్విన్ మూడు చొప్పున పరుగులు చేశారు. 
 
అయితే మ్యాచ్ ఆఖరులో ఉమేష్ యాదవ్ రెండు సిక్సర్లు బాదడంతో భారత్ వంద పరుగులైనా దాటగలిగింది. లేకుంటే వంద పరుగులు లేపే చాప చుట్టేసిది. ఆసీస్ బౌలర్లలో మాథ్యూ కునెమన్‌ ఏకంగా ఐదు వికెట్లు తీయగా, లైయ్ మూడు వికెట్లు పడగొట్టాడు. టాడ్ మర్ఫీకి ఓ వికెట్ దక్కింది. కాగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో భారత్ నెగ్గి నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments