Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జస్ట్ 5 నిమిషాల్లో చార్జింగ్.. రెడ్మీ 300 డబ్ల్యూ ఇమ్మోర్టల్ చార్జర్

mobile massage
, బుధవారం, 1 మార్చి 2023 (14:23 IST)
స్మార్ట్ మొబైల్స్ తయారీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న రెడ్మీ కంపెనీ ఇపుడు సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. కొత్త ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని రూపొందించిద. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లో మొబైల్ చార్జింగ్ పూర్తికానుంది. ఈ టెక్నాలజీ ద్వారా 300 డబ్ల్యూ ఇమ్మోర్టల్ సెకండ్ చార్జర్ కేవలం ఐదు నిమిషాల్లోనే చార్జ్ చేస్తుందని తెలిపింది. అయితే, చార్జింగ్ టెక్నాలజీకి సంబంధించిన సాంకేతిక అంశాలను చైనా ఫోన్ తయారీ కంపెనీ అయిన రెడ్మీ స్పష్టంగా నిర్ధారించాల్సివుంది. 
 
సాధారంగా స్మార్ట్ ఫోన్ వినియోగంచే ప్రతి ఒక్కరూ చార్జింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే చర్యల్లో భాగంగానే ఫాస్ట్ ఛార్జింగ్ సమస్యను కనిపెట్టారు. అత్యంత ప్రాముఖ్యత పొందిన ఫీచర్. ఇది వినియోగదారులకు తమ పరికరాలను సాధారణం కంటే చాలా వేగంగా రీచార్జ్ చేయడానికి దోహదపడుతుంది. 
 
ఈ రెడ్మీ వెబ్‌సైట్ ప్రకారం. ఈ కొత్త చార్జింగ్ టెక్నాలజీకి 300 డబ్ల్యూ ఇమ్మోర్టల్ సెకడ్ చార్జర్ అని పేరు పెట్టారు. ఇది ప్రత్యామ్నాయ చార్జింగ్ టెక్నాలజీగా భావిస్తున్నారు. ఈ ఛార్జింగ్ టెక్నాలజీ 4,100mAh బ్యాటరీని 43 సెకన్లలో 10 శాతం, రెండు నిమిషాల 13 సెకన్లలో 50 శాతం మరియు ఐదు నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. 
 
ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ ఏమీ కాదని, రెడ్ మీ నోట్ 12 ప్రో ప్లస్ వేరియంట్‌లో ఉన్న ఛార్జింగ్ టెక్నాలజీ కి ఇది ఒక మార్పు అని కంపెనీ పేర్కొంది. రెడ్ మీ నోట్ 12 డిస్కవరీ ఎడిషన్, చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది, ఇప్పటి వరకు కంపెనీ యొక్క వేగవంతమైన ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇది 210W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దాదాపు 10 నిమిషాల్లో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐరాసలో నిత్యానంద రాగం.. కైలాస నుంచి మహిళా ప్రతినిధి స్పీచ్!