Webdunia - Bharat's app for daily news and videos

Install App

INDW vs ENGW 2021: ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్.. ఇంగ్లండ్‌తో మిథాలీ సేన ఢీ

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (13:43 IST)
Mithali Team
ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్టు టెస్టు మ్యాచ్‌ ఆడబోతోంది. బుధవారం నుంచి ప్రారంభం అయ్యే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో మిథాలీసేన తలపడుతుంది. 2014 తర్వాత భారత్‌ టెస్టులు ఆడనుండటం ఇదే తొలిసారి కాగా.. ఈ మధ్య కాలంలో మూడు టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అయితే గత పర్యటనలో ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించిన భారత జట్టును తక్కువగా అంచనా వేయలేం. 
 
నాలుగు రోజులు మాత్రమే జరగనున్న ఈ టెస్టు మ్యాచ్ కోసం ఈ నెల 3న ఇంగ్లండ్‌కి చేరుకున్న భారత మహిళల జట్టు.. అక్కడ క్వారంటైన్‌లో ఉండటంతో సన్నద్ధతకి పూర్తి సమయం దొరకలేదు.అయినప్పటికీ ఈరోజు ప్రారంభమయ్యే ఏకైక టెస్టులో భారత జట్టు ఫేవరెట్ అని రికార్డులు చెప్తున్నాయి.
 
భారత మహిళలు చివరిసారి 2014లో టెస్టు మ్యాచ్‌ ఆడారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆడిన వారిలో మిథాలీ రాజ్ సహా ఏడుగురు ప్రస్తుత జట్టులో ఉన్నారు. భారత్‌ ఈ ఏకైక టెస్టు కోసం 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టు ఆడిన అనుభవం ఉండగా.. అందరూ ఆడిన మ్యాచ్‌లు కలిపి 30 మాత్రమే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

తర్వాతి కథనం
Show comments