Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న శ్రీలంక... వికెట్ కోల్పోయిన భారత్

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (14:47 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, గురువారం భారత్ శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా మైదానంలోకి వచ్చిన రోహిత్ శర్మ, గిల్‌‌లు బ్యాటింగ్‌ ప్రారంభించారు. అయితే, భారత్ మొదటి ఓవర్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ మరో ఓపెనర్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 7.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 42 పరుగులు చేసింది. ఇందులో గిల్ 10, కోహ్లీ 26 చొప్పున పరుగులతో ఉన్నారు. తొలి వికెట్‌ను శ్రీలంక బౌలర్ మధుషంక పడగొట్టాడు. 
 
కాగా, ఈ టోర్నీలో భారత ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఆరింటిలో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందితే భారత్ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టనుంది. ఇదే జరిగితే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 మెగా ఈవెంట్‌లో సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలుస్తుంది. అలాగే, పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుపొంది సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇంకోవైపు, శ్రీలంక జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

Hyderabad: రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. 22 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments