Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ వీరబాదుడు... ట్వంటీ20 సిరీస్ భారత్ కైవసం

పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (09:28 IST)
పర్యాటక శ్రీలంక జట్టుతో ఇండోర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ వీరవిహారం చేసి కేవలం 35 బంతుల్లో సెంచరీ బాదాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.
 
ఆ తర్వాత 261 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 17.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత జట్టు 88 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. భారత బౌలర్లలో చాహల్(4), కుల్దీప్ (3), పాండ్యా(1), జయదేవ్(1) వికెట్లతో శ్రీలంక నడ్డి విడిచారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టీ20 డిసెంబర్ 24న ముంబైలో జరగనుంది.
 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత క్రికెట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ 118(10 పోర్లు, 12 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, రాహుల్ 89, ధోనీ (28) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో ప్రదీప్(2), పెరెరా(2) చమీర (1) వికెట్లు పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

28°C టెంపరేచర్ జానర్‌లో మూవీ సాగదు: నిర్మాత సాయి అభిషేక్

ప్రియదర్శి, పరపతి పెంచే చిత్రం సారంగ పాణి జాతకం: కృష్ణప్రసాద్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

తర్వాతి కథనం
Show comments