నేడు ధర్మశాలలో భారత్ - శ్రీలంక తొలి వన్డే

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో ఓపెనర్ రోహిత్ శర్మ టీమిండియా క

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (09:49 IST)
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో ఓపెనర్ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కెప్టెన్‌గా అతనికిది తొలి మ్యాచ్. డేనైట్ మ్యాచే అయినా.. మంచు కారణంగా ఉదయం 11.30 ని.లకు ప్రారంభంకానుంది. 
 
మరోవైపు, ఢిల్లీ వేదికగా జరిగిన చివరి టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగింది. దీంతో ఆ జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తొలి మ్యాచ్ గెలిచి వన్డే సిరీస్‌‍ను శుభారంభం చేయాలన్న పట్టుదలతో లంకేయులు ఉన్నారు. స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ల్లో లంకపై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉన్న విషయం తెల్సిందే. దీన్ని సరిచేయాలన్న తలంపులో లంక జట్టు ఉంది. 
 
ఇకపోతే, తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కెప్టెన్‌గా ఐపీఎల్‌లో మంచి అనుభవం ఉంది. అక్కడ అతనొక విజయవంతమైన సారథి. ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌కు మంచి శుభారంభాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మరోవైపు ధోనీ మద్దతు కూడా ఉంటుంది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రహానే ఫామ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. ఓపెనర్లు ధావన్, రోహిత్‌ శర్మ అందించిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచాలంటే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెనే కీలకం. 
 
ఈ నేపథ్యంలో రహానే ఫామ్‌లోకి రావాలని జట్టు బలంగా కోరుకుంటోంది. శ్రేయస్‌ అయ్యర్, మనీశ్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌‌లతో పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, అనుభవజ్ఞుడైన ధోనీలతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ, భారత కుర్రోళ్లు ఎపుడు ఎలా ఆడుతారో ఎవరికీ అంతుచిక్కని ఓ ప్రశ్న.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

తర్వాతి కథనం
Show comments