Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాపై ఆరో గెలుపు మనదే.. కోహ్లీ అదుర్స్.. భారత్ ఘనవిజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32.1 ఓవర్లలోనే 206 పరుగులతో చేధించి... 5-1 తేడాతో సిరీస

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (09:18 IST)
దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32.1 ఓవర్లలోనే 206 పరుగులతో చేధించి... 5-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్‌ను గెలుచుకుని టీమిండియా సరికొత్త రికార్డును సృష్టించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. బౌలర్ల దెబ్బకు 204పరుగులకే సఫారీ టీమ్ ఆలౌట్ అయ్యింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. అయితే రోహిత్ శర్మ ఔటైన అనంతరం క్రీజులోకొచ్చిన కోహ్లీ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 82 బంతుల్లో 103 పరుగులు చేసిన కోహ్లీ 17ఫోర్లతో సఫారీ బౌలర్లపై పంజా విసిరాడు. కోహ్లీ సెంచరీతో భారత్ గెలుపు సునాయాసమైంది. 
 
ఇకపోతే.. 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ, ఈ సిరీస్‌లో మూడో సెంచరీ చేసి జట్టుకు భారీ విజయం అందించాడు. ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్''తో పాటు, ''మ్యాన్ ఆఫ్ ది సిరీస్"ను సైతం కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments