Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాపై ఆరో గెలుపు మనదే.. కోహ్లీ అదుర్స్.. భారత్ ఘనవిజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32.1 ఓవర్లలోనే 206 పరుగులతో చేధించి... 5-1 తేడాతో సిరీస

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (09:18 IST)
దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 32.1 ఓవర్లలోనే 206 పరుగులతో చేధించి... 5-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తద్వారా దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్‌ను గెలుచుకుని టీమిండియా సరికొత్త రికార్డును సృష్టించింది. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. బౌలర్ల దెబ్బకు 204పరుగులకే సఫారీ టీమ్ ఆలౌట్ అయ్యింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యారు. అయితే రోహిత్ శర్మ ఔటైన అనంతరం క్రీజులోకొచ్చిన కోహ్లీ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 82 బంతుల్లో 103 పరుగులు చేసిన కోహ్లీ 17ఫోర్లతో సఫారీ బౌలర్లపై పంజా విసిరాడు. కోహ్లీ సెంచరీతో భారత్ గెలుపు సునాయాసమైంది. 
 
ఇకపోతే.. 129 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ, ఈ సిరీస్‌లో మూడో సెంచరీ చేసి జట్టుకు భారీ విజయం అందించాడు. ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్''తో పాటు, ''మ్యాన్ ఆఫ్ ది సిరీస్"ను సైతం కోహ్లీ సొంతం చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments