Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో వన్డే : రాయుడు - పాండ్యా మెరుపుదాడి... భారత్ 252 ఆలౌట్

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (11:13 IST)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 49.5 ఓవ్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును హైదరాబాద్ కుర్రోడు అంబటి రాయుడు (90)తో ఆదుకున్నాడు. ఫలితంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరును చేసింది. 
 
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే మ్యాచ్ ఆదివారం ఉదయం ప్రారంభంకాగా, భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఒక దశలో 18 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో అంబటి రాయుడు, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ముఖ్యంగా రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్, చివర్లో పాండ్యా మెరుపులతో టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. 
 
రాయుడు 113 బంతుల్లో 44సిక్స్‌లు, 8 ఫోర్లతో 90 పరుగులు చేయగా.. చివర్లో పరుగుల సునామీ సృష్టించిన పాండ్యా కేవలం 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 5 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరికీ తోడుగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నిలిచాడు. విజయ్ 64 బంతుల్లో 4 ఫోర్లతో 45 పరుగులు చేయడంతో భారత్.. ప్రత్యర్థి ముంగిట ఛాలెంజింగ్ స్కోరును ఉంచింది. అంతకుముందు టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మెన్ రోహిత్ (2), ధావన్ (6), శుభ్‌మాన్ గిల్  (7), ధోనీ (1) దారుణంగా విఫలమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments