Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో వన్డే : రాయుడు - పాండ్యా మెరుపుదాడి... భారత్ 252 ఆలౌట్

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (11:13 IST)
న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 49.5 ఓవ్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టును హైదరాబాద్ కుర్రోడు అంబటి రాయుడు (90)తో ఆదుకున్నాడు. ఫలితంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరును చేసింది. 
 
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే మ్యాచ్ ఆదివారం ఉదయం ప్రారంభంకాగా, భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఒక దశలో 18 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో అంబటి రాయుడు, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. ముఖ్యంగా రాయుడు బాధ్యతాయుత ఇన్నింగ్స్, చివర్లో పాండ్యా మెరుపులతో టీమిండియా 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. 
 
రాయుడు 113 బంతుల్లో 44సిక్స్‌లు, 8 ఫోర్లతో 90 పరుగులు చేయగా.. చివర్లో పరుగుల సునామీ సృష్టించిన పాండ్యా కేవలం 22 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 5 సిక్స్‌లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరికీ తోడుగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ నిలిచాడు. విజయ్ 64 బంతుల్లో 4 ఫోర్లతో 45 పరుగులు చేయడంతో భారత్.. ప్రత్యర్థి ముంగిట ఛాలెంజింగ్ స్కోరును ఉంచింది. అంతకుముందు టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మెన్ రోహిత్ (2), ధావన్ (6), శుభ్‌మాన్ గిల్  (7), ధోనీ (1) దారుణంగా విఫలమయ్యారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments