Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పల్ వన్డే మ్యాచ్ : డ్రింక్స్ బ్రేక్ వేళకు భారత్ స్కోరు 95/2

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (15:02 IST)
హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ బుధవారం మధ్యాహ్నం నుంచి జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 
 
శుభ్ మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అటు గిల్, ఇటు రోహిత్ ఆరంభం నుంచే మంచి షాట్లతో అలరించారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ 12 ఓవర్లలో తొలి వికెట్‌కు 60 పరుగులతో మంచి పునాది వేశారు. కానీ, టిక్నర్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి నేరుగా భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ మిడాన్‌‍లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా 34 పరుగులకే అతను వెనుదిరిగాడు. 
 
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలదొక్కులేక పోయారు. శ్రీలంకతో సిరీస్‌లో రెండు సెంచరీలు సాధించిన కోహ్లీ.. షిప్లీ బౌలింగ్ లో తొలి ఫోర్ కొట్టాడు. కానీ, 16వ ఓవర్లో అద్భుత టర్నింగ్ బాల్తో మిచెల్ శాంట్నర్ అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా విరాట్ 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 88/2. మరో ఓపెనర్ గిల్ మాత్రం ధాటిగా ఆడుతుండగా, డ్రింక్స్ బ్రేక్ సమయానికి భారత్ 17 ఓవర్లలో 95/2 స్కోరుతో నిలిచింది. ప్రస్తుతం గిల్ - కిషాన్‌లు క్రీజ్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments