Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ఉప్పల్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్

uppal stadium
, బుధవారం, 18 జనవరి 2023 (09:19 IST)
మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ బుధవారం జరుగనుంది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందుకోసం 2500 మంది పోలీసులతో గట్టి భద్రతను కల్పించారు. 
 
అలాగే, ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లడానికి వీల్లేదని, అలాంటి వస్తువులు ఏవైనా ఉంటే స్టేడియంలోనికి అనుమతించబోమని పోలీసులు స్పష్టంచేశారు. ఈ మ్యాచ్ ఉప్పల్‌లోని శ్రీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
 
మరోవైపు, ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ నగర పోలీసులు కొన్ని సూచనలు చేశారు. మొబైల్ ఫోన్స్ మినహా ఇతర ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని రాచకొండ పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరే ముందే ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మాత్రమే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపారు. 
 
కాగా, స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో భారత్ మూడు మ్యాచ్‌లలో తలపడింది. ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెలుచుకుంది. ఇపుడు కఠిన సవాలుకు సిద్ధమైంది. వరుసగా రెండు వన్డే ప్రపంచ కప్‌ల్లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం బరిలోకి దించే తుది జట్ల అంచనను పరిశీలిస్తే,
 
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లీ, గిల్, సూర్యకుమార్, ఇషాన్, (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సుందర్, చాహల్ లేదా కుల్దీప్, షమి, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
 
కివీస్ : అలెన్, కాన్వే, చాప్‌మన్ లేదా నికోల్స్, మిచెల్, లేథమ్ (కెప్టెన్), ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, శాంట్నర్, షప్లీ, ఫెర్గ్యూసన్, డఫీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రీడాస్ఫూర్తి అంటే ఇదే కదా... ఊతకర్రలతో ఫుట్ బాల్ (వీడియో)