Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా ట్వంటీ20 మ్యాచ్ : కివీస్ చిత్తు - భారత్ క్లీన్‌స్వీప్

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (22:40 IST)
కోల్‌కతా వేదికగా పర్యాటక న్యూజిలాంజ్ జట్టుతో జరుగుతున్న మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. భారత్ ఉంచిన 185 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భాగంగా న్యూజిలాండ్ జట్టు కేవలం 17.2 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 72 పరుగుల తేడాతో విజయభేరీ మోగించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో 185 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన కివీస్ ఆటగాళ్లు ఏ దశంలోనూ క్రీజ్‌లో నిలదొక్కుకోలేక పోయారు. ఓపెనర్లలో గుప్తిల్ (51) మినహా ఏ ఒక్కరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేకపోయారు. మిచెల్ 5, చాంపన్ 0, ఫిలిప్స్ 0, సైఫర్ట్ 17, నీషమ్ 3, సట్నెల్ 2, మిల్నే 7, సోధి 9, ఫెర్గ్యూసన్ 14, బౌల్ట్ 2 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. 
 
ఫలితంగా 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత బౌలర్లలో అక్సర్ పటేల్ 3, హర్షల్ పటేల్ 2, దీపక్, యజువేంద్ర, వెంకటేష్ అయ్యర్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున తీసి, న్యూజిలాండ్ ఆటగాళ్ల వెన్ను విరిచారు. 
 
అంతకుముందు భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో కివీస్ ముంగిట 185 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆదుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి అర్థ సెంచరీ చేశాడు. మొత్తం 31 బంతులు ఎదుర్కొన్న రోహిత్ ఐదు ఫోర్లు, మూడు ఫోర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. 
 
 
ఇలాగే, మరో ఓపెనర్ ఇషాన్ ఖాన్ 29, శ్రేయాస్ అయ్యర్ 25, వెంకటేష్ అయ్యర్ 20, హర్షల్ పటేల్ 18, దీపక్ చాహర్ 21 చొప్పున పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా, రిషభ్ పంత్ 4, అక్సర్ 2 చొప్పున మాత్రమే రన్స్ చేశారు. కివీస్ బౌలర్లలో మిచెల్ మూడు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీయగా, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, ఫెర్గ్యూసన్, సోథిలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
అంతకుముందు మూడు ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, చివరి టీ20 మ్యాచ్ ఆదివారం కోల్‌కతా వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న రోహిత్ శర్మ సేన... ఇపుడు చివరి ట్వంటీ20లోనూ గెలుపొందడంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్... తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఓపెనర్ రాహుల్, స్పిన్నర్ అశ్విన్‌కు విశ్రాంతి నివ్వగా, వారి స్థానాల్లో ఇషాన్ కిషన్, యజువేంద్ర చాహల్‌కు చోటు కల్పించారు. 
 
అలాగే, కివీస్ జట్టులో కూడా ఒక మార్పు చేశారు. ఆ జట్టు సారథి పేసర్ టిమ్ సౌథీ ఈ మ్యాచ్‌కు దూరంకాగా, స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 

సంబంధిత వార్తలు

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments