Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హోటళ్ళలో ఫోటోలు తీసిన ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు?

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (15:46 IST)
క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్ - భారత జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ బర్మింగ్ హామ్ వేదికకానుంది. ఇందుకోసం ఇరు జట్లూ బర్మింగ్ హామ్‌లోని హయత్ రీజెన్సీ హోటల్‌లో బసచేసివుంది. ఈ జట్టుతో పాటు.. ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 
 
అయితే, టీమిండియా ఆటగాళ్లు బసచేసిన నక్షత్ర హోటల్‌లో ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి కలకలం సృష్టించారు. ఆటగాళ్లను, వారి కుటుంబసభ్యులను ఫొటోలు తీస్తూ హోటల్‌లో ఇబ్బందికర వాతావరణం సృష్టించారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఆటగాళ్లు ఉంటున్న గదుల చుట్టూ తిరుగుతూ, తీవ్ర అసౌకర్యానికి గురిచేశారు. 
 
దీంతో అప్రమత్తమైన భారత క్రికెట్ జట్టు సభ్యులు మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించగా, మేనేజ్‌మెంట్ వెంటనే స్పందించి హోటల్ యాజమాన్యానికి గట్టిగా ఫిర్యాదు చేసింది. దాంతో, హోటల్ యాజమాన్యం వెంటనే రంగంలోకి దిగి ఆ ముగ్గుర్ని తీవ్రంగా హెచ్చరించి అక్కడినుంచి పంపించివేసింది. ఈ ఘటన ఆటగాళ్ళలో ఆందోళన రేకెత్తించింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments