Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో తొలి టెస్టు.. జో రూట్ సెంచరీ.. 200 పరుగులు దాటిన ఇంగ్లండ్

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (16:23 IST)
Joe Root
ఇండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సెంచరీ కొట్టాడు. ఇది అతనికి వందో టెస్ట్ కావడం విశేషం. 164 బంతుల్లోనే 12 ఫోర్లతో రూట్ మూడంకెల స్కోరు అందుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 20వ సెంచరీ. 
 
63 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను సిబ్లీతో కలిసి రూట్ ఆదుకున్నాడు. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 160కిపైగా పరుగులు జోడించారు. అటు సిబ్లీ కూడా సెంచరీ వైపు అడుగులు వేస్తున్నాడు.
 
కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్ స్కోరు 200 పరుగులు దాటింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. అయితే, 63 పరుగుల వద్ద ఓపెనర్లు రోరీ బర్న్స్ (33), డేనియల్ లారెన్స్ (0) అవుటవడంతో జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది.
 
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్.. ఓపెనర్ డొమినిక్ సిబ్లీతో కలిసి ఇన్సింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 74 ఓవర్లు ముగిశాయి. ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. డొమినిక్ 67, రూట్ 94 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌లో హిందూ మంత్రి కాన్వాయ్‌‍పై దాడి (Video)

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు - తీర్చేమార్గం లేకు రైలుకిందపడి ఆత్మహత్య!!

ప్రకాశం జిల్లాలో పిడుగుపడింది... రెండు ప్రాణాలు పోయాయి...

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

తర్వాతి కథనం
Show comments