Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్ : కష్టాల్లో భారత్.. నాలుగు వికెట్లు ఢమాల్

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (15:12 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ వేదికగా కీలక మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుతెబ్బ తగిలింది. జట్టు స్కోరు 26 పరుగుల వద్ద ఉండగా ఓపెనర్ గిల్ (9), ఆ తర్వాత విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. దీంతో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి వోక్స్ బౌలింగ్‌లో ఉడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 40. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు క్రీజ్‌లో ఉన్నారు. 
 
కాగా, నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ మణికట్టుకు గాయమైనట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తలను తోసిపుచ్చుతూ రోహిత్ శర్మ మైదానంలోకి  రావడంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, జట్టులో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. అటు, వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నప్పటికీ, ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగింది. 
 
ఇప్పటివరకు టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడి అన్నింట్లోనూ గెలిచిన టీమిండియా... నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై నెగ్గితే సెమీస్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఇంగ్లండ్ జట్టు ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకదాంట్లోనే నెగ్గింది. ఆదివారం మ్యాచ్‌తో కలిపి ఇంగ్లండ్ ఇంకా 4 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, అన్నింట్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ఏవై‌నా సెమీస్ చాన్సులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదీకూడా ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments