Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాతో తొలి టెస్ట్.. భారత్ బ్యాటింగ్.. తుది జట్టులో ఉమేశ్‌కు చోటు

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (11:21 IST)
బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత జట్టు బుధవారం ఆతిథ్య జట్టుతో తొలి టెస్టు ఆడుతోంది. ఇందుకోసం ప్రకటించిన తుది జట్టులో ఉమేశ్ యాదవ్‌కు చోటు కల్పించారు. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. దానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న బలమైన కోరికతో రగిలిపోతోంది. 
 
ఈ నేపథ్యంలో తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయంతో జట్టుకు దూరమైన మహ్మద్ షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. దీంతో ఉనద్కత్ రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. 
 
కాగా, బొటన వేలి గాయం కారణంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో జట్టు పగ్గాలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఇప్పటికే వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్ అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భారత్ జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. 
 
కాగా, టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై భారత్ ఇప్పటివరకు ఓటమి ఎరుగదు. కాబట్టి ఈ సిరీస్‌లోన అదే జోరు కొనసాగించాలని భారత్ యోచిస్తుంది. మరోవైపు, బంగ్లాదేశ్ క్రికెటర్ జకీర్ హాసన్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లోకి అరంగేట్రం చేశారు. భారత జట్టును ఇన్నింగ్స్‌ను శుభమన్ గిల్, కేఎల్ రాహుల్ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments