Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింక్ బాల్ టెస్టు : ప్రేక్షకులకు డబ్బులు వాపస్ ఇస్తున్న క్యాబ్

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (17:52 IST)
భారత్‌లో తొలిసారి డే అండ్ నైట్ టెస్ట్ జరిగింది. ఈ పిక్ బాల్ టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదిక అయింది. భారత్ - బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఐదు రోజుల పాటు సాగాల్సిన ఈ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. అయితే, ఈ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరిగితే వచ్చే మజా వేరుగా ఉంటుందని కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో, చివరి రెండు రోజులకు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) నిర్ణయించుకుంది. నాలుగు, ఐదు రోజులకు మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసినవారికి నగదు వాపస్ చేసే ప్రక్రియ షురూ అయిందని క్యాబ్ అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మెసేజ్ లు పంపించామని తెలిపారు. 
 
కాగా, ఈ టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. అలాగే, భారత ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సెంచరీతో మరోమారు సత్తా చాటాడు. ఫలితంగా స్వదేశంలో పింక్ బాల్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments