Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాతో తొలి టెస్ట్.. తడబడుతూ సాగిన భారత్ బ్యాటింగ్.. ఫస్టే డే స్కోరు 278/6

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (18:02 IST)
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో క్రీజ్‍‌లో ఉన్నాడు. 
 
మరోవైపు, పుజారా 90 పరుగులు చేసి మరో పది పరుగుల తేడాతో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 45 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. 
 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... ఒక దశలో నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన పుజారా, శ్రేయస్ అయ్యర్‌ను నింపాదిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త వహించాడు. 
 
ఈ క్రమంలో పుజార్ 203 బంతులు ఎదుర్కొని 11 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. అలాగే, శ్రేయాస్ అయ్యర్ కూడా తన వికెట్‌ను కాపాడుకుంటూ 169 సిక్స్‌లో 10 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. టీమిండియా ఓపెనర్లు రాహుల్ 22, గిల్ 20 చొప్పున పరుగులు చేసి విఫలమయ్యారు.
 
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వికెట్ సమర్పించుకుని నిరాశపరిచాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది బంగ్లాదేశ్ బౌలర్లలో ఇస్లామ్ 3, హాసన్ 2, అహ్మద్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

తర్వాతి కథనం
Show comments