Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన ఘనతను సాధించిన రవీంద్ర జడేజా... ఎలైట్ క్లబ్‌లో చోటు!

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (17:36 IST)
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండ్ క్రికెటర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత క్రికెట్ జట్టు తరపున టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మెట్లలో భారత్ తరపున ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకే దక్కింది. ఇపుడు వారి సరసన రవీంద్ర జడేజా కూడా చేరాడు. 
 
టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్లలో భారత్‌ తరపున 50, అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌గా జడేజా ఎలైట్‌ క్లబ్‌లో చేరాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సరసన జడ్డూ నిలువడం విశేషం. జడేజా ఇప్పటివరకు 50 టెస్టులు, 168 వన్డేలు, 50 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా ధోనీ, కోహ్లీతో దిగిన ఫొటోలను జడేజా ట్విటర్లో షేర్‌ చేశాడు.
 
అలాగే, తనకు ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచి, సహకరించిన బీసీసీఐ, సహాయక సిబ్బందికి ధన్యవాదాలంటూ పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో బ్యాట్‌, బంతితో రాణించిన జడేజా టెస్టుల్లో 15వ అర్థశతకం సాధించాడు. 2004లో అరంగేట్రం చేసిన ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. మరోవైపు కోహ్లీ 87 టెస్టులు, 251 వన్డేలు, 85 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేవు: పవన్ కల్యాణ్ (video)

భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బెంగుళూరు టెక్కీ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

తర్వాతి కథనం
Show comments