Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన ఘనతను సాధించిన రవీంద్ర జడేజా... ఎలైట్ క్లబ్‌లో చోటు!

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (17:36 IST)
భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండ్ క్రికెటర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత క్రికెట్ జట్టు తరపున టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మెట్లలో భారత్ తరపున ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకే దక్కింది. ఇపుడు వారి సరసన రవీంద్ర జడేజా కూడా చేరాడు. 
 
టెస్టులు, వన్డేలు, టీ20లు మూడు ఫార్మాట్లలో భారత్‌ తరపున 50, అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌గా జడేజా ఎలైట్‌ క్లబ్‌లో చేరాడు. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సరసన జడ్డూ నిలువడం విశేషం. జడేజా ఇప్పటివరకు 50 టెస్టులు, 168 వన్డేలు, 50 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా ధోనీ, కోహ్లీతో దిగిన ఫొటోలను జడేజా ట్విటర్లో షేర్‌ చేశాడు.
 
అలాగే, తనకు ఇన్నేళ్లుగా మద్దతుగా నిలిచి, సహకరించిన బీసీసీఐ, సహాయక సిబ్బందికి ధన్యవాదాలంటూ పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టులో బ్యాట్‌, బంతితో రాణించిన జడేజా టెస్టుల్లో 15వ అర్థశతకం సాధించాడు. 2004లో అరంగేట్రం చేసిన ధోనీ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. మరోవైపు కోహ్లీ 87 టెస్టులు, 251 వన్డేలు, 85 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.

 

సంబంధిత వార్తలు

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

తర్వాతి కథనం
Show comments