Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుకున్నదే జరిగింది... ధోనీ లేడు... మ్యాచ్ ఓడారు...(Video)

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (21:26 IST)
అందరూ అనుకున్నట్లే ధోనీ జట్టులో ఆడకపోతే ఆ మ్యాచ్ పోతుందన్న నమ్మకం మరోసారి నిజమైంది. ఢిల్లీలో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరిగిన ఐదో వన్డేలో ఇండియా 35 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీనితో సిరీస్ 3-2 తేడాతో ఆసీస్ వశమైంది. ఇకపోతే ధోనీ జట్టులో వుండి ఆడకపోతే ఆ మ్యాచ్ మటాష్ అంటూ గత కొన్నిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు వస్తూనే వున్నాయి. అనుకున్నట్లుగా మ్యాచ్ ఓడింది టీమిండియా.
 
273 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ఆదిలోనే తడబాటు పడింది. శిఖర్ ధావన్ ఎప్పటిలానే అత్యల్ప స్కోరుకే పెవిలియన్ దారి పట్టాడు. కేవలం 12 పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి కూడా కేవలం 20 పరుగులకే ఔటయ్యాడు. పంత్ 16 పరుగులు, శంకర్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. రోహిత్ శర్మ కూడా 89 బంతుల్లో 56 పరుగులు చేసి పెవిలియన్ ముఖం పట్టాడు. 
 
జడేజా అయితే డకౌట్ అయ్యాడు. జాధవ్-కుమార్ ఇద్దరూ ధాటిగా ఆడటంతో గెలుస్తారనే ఆశలు చిగురించాయి. కానీ వెంటవెంటనే ఇద్దరూ తమ వికెట్లు పారేసుకుని వెళ్లిపోయారు. జాదవ్ 44 పరుగులు, కుమార్ 46 పరుగుల వద్ద నిష్క్రమించారు. ఇక ఆ తర్వాత వచ్చిన సామి 3 పరుగులు, యాదవ్ 9 పరుగులు చేసినా అప్పటికే భారత్ అపజయం ఖరారైపోయింది. దీనితో 50 ఓవర్లకు 237 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. వీడియో చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments