Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్ టెస్ట్ : సెంచరీ కొట్టిన కోహ్లీ... ఆసీస్ స్కోరును దాటేసిన భారత్

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (15:46 IST)
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌‍లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సుధీర్ఘకాలం తర్వాత బ్యాట్‌తో రాణించి సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్న కోహ్లీ 241 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ చివరగా గత 2019లో ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన టెస్టులో సెంచరీ చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కోహ్లీ ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 
 
ఇదిలావుంటే, మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 289/3తో బరిలోకి భారత్ ఆరంభంలోనే రవీంద్ర జడేజా (28) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ (44)తో కలిసి ఐదో వికెట్‌‍కు 86 పరుగులు చేశాడు. రెండు భారీ సిక్సర్లతో అర్థ సెంచరీకి చేరువైన భరత్‌ను బౌలర్ లయన్ వెనక్కి పంపాడు. కోహ్లీ మాత్రం లయన్ బౌలింగులోనే సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 
 
ఇది కోహ్లీకి 28వ వ్యక్తిగత సెంచరీ. ప్రస్తుతం కోహ్లీ (160), అక్షర్ పటేల్ (49)తో కలిసి క్రీజ్‌లో దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమలో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌‍లో చేసిన 480 పరుగులను భారత్ దాటేసింది. ప్రస్తుతం భారత జట్టు 5 వికెట్లకు 508 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 2, టాడ్ మర్ఫీ 2, మాథ్యూ కుహ్నెమన్‌ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments