Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లి సెంచరీ వృధా... పేక మేడలా కూలిన వికెట్లు... ఆసీస్ విజయం

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (21:21 IST)
కోహ్లీ చేసిన సెంచరీ వృధా అయింది. భారత్ బ్యాట్సమన్ల వికెట్లు పేకమేడలా కూలిపోవడంతో ఆసీస్ 32 పరుగుల తేడాతో భారత్ పైన మూడో వన్డేలో విజయం సాధించింది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే తడబడింది. 
 
ధావన్ కేవలం 1 పరుగు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా ఎంతోసేపు నిలువలేకపోయాడు. అతడు 14 పరుగుల వద్ద ఔటయ్యాడు. విరాట్ కోహ్లి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విరాట్ కోహ్లి దూకుడుగా ఆడటం చూసి ఇక ఇండియా గెలుపు ఈజీనే అనుకున్నారు. ఐతే వచ్చినవారు వచ్చినట్లు వికెట్లు సమర్పించుకుంటూ వెళ్తుండటంతో భారత్ విజయావకాశాలు ఆవిరయ్యాయి. రాయుడు 2 పరుగులు, ధోనీ 26 పరుగులు, జాదవ్ 26 పరుగులు చేసి అవుటయ్యారు. 
 
కోహ్లి కూడా 38వ ఓవర్లో తన వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లి 123 పరుగులు చేయడంతో భారత్ జట్టు ఆ స్థితిలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఐతే ఆ తర్వాత వచ్చినవారు నిలకడగా రాణించలేకపోయారు. శంకర్ 32 పరుగులు, జడేజా 24 పరుగులు, కులదీప్ యాదవ్ 10 పరుగులు, మహ్మద్ సామి 8 పరుగులు చేశారు. మొత్తం 281 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీనితో ఆసీస్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments