Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్ళదు : తేల్చి చెప్పిన కేంద్రం

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (19:54 IST)
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇందుకోసం ఐసీసీ కీలక సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర ప్రకటన చేసింది. చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. 
 
బీసీసీఐ చెప్పినట్టుగానే భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్ళదని స్పష్టం చేసింది. బీసీసీఐ నిర్ణయాన్ని తాము కూడా సమర్థిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. అందుకే భారత క్రికెట్ జట్టు సభ్యులను చాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ గడ్డకు పంపించేది లేదని స్పష్టం చేశారు. 
 
కాగా, భారత్ తన నిర్ణయాన్ని తేటతెల్లం చేసిన నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్‌లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విధానం మేరకు కొన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో మరికొన్ని మ్యాచ్‌లు ఇతర దేశాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. అయితే, పాకిస్థాన్ మాత్రం హైబ్రిడ్ విధానానికి అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగాల్సిన ఐసీసీ కీలక సమావేం శనివారానికి వాయిదాపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

తర్వాతి కథనం
Show comments