Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2022 (09:53 IST)
భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో నుంచి మంటలు చెలరేగి కారు మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆయన ప్రాణాలతో బయపటపడ్డారు. కానీ, తలకు గాయం కావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా రూర్కీ అనే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 
 
కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నాడు. ఆయన డ్రైవింగ్ చేస్తూ ఢిల్లీకి వెళుతున్నాడు. డివైడర్‌ను డీకొట్టగానే ఒక్కసారిగా కారులో నుంచి మటలు చెలరేగాయి. దీంతో కారు డోరు అద్దాలు పగులగొట్టి కారులో నుంచి బయటకు దూకేశాడు. ప్రమాదం కారణంగా కారు పూర్తిగా దగ్ధమైపోయింది. 
 
ఈ ఘటనపై పంత్ తలకు, మోకాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం స్థలానికి చేరుకుని పంత్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయినప్పటికీ మెరుగైన వైద్య సేవల కోసం డెహ్రూడూన్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments