Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్లాండ్ వన్డే మ్యాచ్ : శ్రేయాస్ మెరుపులు - భారత్ 306 రన్స్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2022 (12:07 IST)
అక్లాండ్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత్ బ్యాటింగ‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లు అర్థ శతకాలతో రాణించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. 
 
ముఖ్యంగా, శ్రేయాస్ అయ్యర్ బ్యాట్‌కు పని చెప్పాడు. ఫలితంగా 76 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 80 పరుగులు చేశాడు. తొలుత ఓపెనర్‌లు ధావన్ 77 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేయగా, మరో ఓపెనర్ గిల్ 65 బంతుల్లో ఓ ఫోర్, మూడు సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఫలితంగా వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యంతో మంచి పునాది వేశారు. 
 
అయితే, మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్, రిషబ్ పంత్‌లు మరోమారు నిరాశపరిచారు. నాలుగో నంబరుగా బరిలోకి దిగిన పంత్ 23 బంతుల్లో 15 పరుగులు చేయగా, సూర్య కుమార్ 4, సంజూ శాంసన్ 36, వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు చేశారు. ఫలితంగా భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్‌లు మూడేసి వికెట్లు తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments