Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలి : కేంద్ర మంత్రి గిరిరాజ్

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:10 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పాక్‌తో మ్యాచ్ ఆడవద్దని టీమిండియాకు సూచించారు. ఇక ఈ వాదనకు బలం చేకూరుస్తూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సైతం భారత్-పాక్ మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలన్నాడు. 
 
ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 24వ తేదీన ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరగనుంది. అయితే జమ్మూకాశ్మర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఇద్దరిని చంపిన ముష్కరులు.. ఈ నెలలో ఇప్పటిదాకా 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. 
 
ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినే టార్గెట్‌గా పెట్టుకుంటూ చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకుండా టీమిండియా బాయ్ కట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 
 
'భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌పై పునరాలోచన చేయాలి'పేర్కొన్నారు. పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ సైతం ఈ మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌తో సత్సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలన్నాడు. 'సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్-పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలి.  కాబట్టి ఇరుదేశాల మధ్య సంత్సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం ఉత్తమం.'అని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments