Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా ట్వంటీ20 : కాస్త కష్టంగా లక్ష్యఛేదన.. భారత్ బోణీ

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (09:44 IST)
కోల్‌కతా వేదికగా జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. వెస్టిండీస్ జట్టు నిర్దేశించిన 110 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా కాస్త కష్టంగా ఛేదించింది. దినేశ్‌ కార్తీక్‌ (34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 నాటౌట్‌), క్రునాల్‌ పాండ్యా (9 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్‌), మనీష్‌ పాండే (24 బంతుల్లో 2 ఫోర్లతో 19) కీలకంగా నిలిచారు. 
 
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. కుల్దీప్‌ మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు చేసి నెగ్గింది. 
 
దీంతో మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌ సేన 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా కుల్దీప్‌ యాదవ్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేసిన క్రునాల్‌ పాండ్యా, ఖలీల్‌ అహ్మద్‌ అద్భుతంగా ఆకట్టుకున్నారు. రెండో టీ20 లోక్నోలో ఈనెల 6వ తేదీన జరుగనుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments