Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్‌ టూర్‌లో వైట్ వాష్ నుంచి టీమిండియా ఎస్కేప్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (16:39 IST)
భారత క్రికెట్ మహిళల జట్టు న్యూజిలాండ్‌ టూర్‌లో వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. చివరిదైన ఐదో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు టీమిండియా మహిళలు. కివీస్ జట్టు చిత్తుగా ఓడించారు. 
 
మొదట బౌలింగ్‌లో కివీస్‌ను కట్టడి చేసిన భారత అమ్మాయిలు ఆ తర్వాత బ్యాట్‌తో సత్తా చాటారు. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, కెప్టెన్ మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీలతో రాణించారు.
 
మొదట భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.  
 
అనంతరం 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళలు మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి 6 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేశారు. 
 
భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన (71), హర్మన్ ప్రీత్ కౌర్ (63), కెప్టెన్ మిథాలీ రాజ్ (57*) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మిగతా బ్యాటర్లలో దీప్తి శర్మ (21), షఫాలీ వర్మ (9), రిచ్ ఘోష్ (7*) పరుగులు చేశారు.
 
కివీస్ బౌలర్లలో జేన్సన్, అమేలీ కేర్, జోన్స్‌, హన్నా రోవ్ తలో వికెట్ తీశారు. వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని పట్టుదలగా ఆడిన భారత అమ్మాయిలు ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా కివీస్ పర్యటనలో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments