Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు టెస్ట్ మ్యాచ్ : 45 పరుగులకే కుప్పకూలిన భారత్

ఠాగూర్
గురువారం, 17 అక్టోబరు 2024 (15:39 IST)
బెంగులూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్‌ను కివీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. కివీస్ బౌలర్ల విజృంభణతో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో భోజన విరామ సమయానికి 34 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత కూడా ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. 
 
భారత ఆటగాళ్లలో కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్, రవీంద్ర జడేజా, అశ్విన్‌లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. మధ్యలో యశస్వి జైస్వాల్ మాత్రం 13 పరుగులు, రిషబ్ పంత్ 20 పరుగులు చేసి భారత్‌ను ఆదుకున్నారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. 
 
పంత్ ఔట్ కావడంతో రోహిత్ సేన 39 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 31.2 ఓవర్లలో 46 రన్స్‌కే చేతులెత్తేసింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ ఐదు వికెట్లు తీయగా, విలియన్ ఓ రూర్కే నాలుగు వికెట్లుతో భారత ఇన్నింగ్స్ పతనంలో తమ వంతు పాత్ర పోషించారు. కాగా, టెస్టుల్లో భారత్ చేసిన మూడో అతి తక్కువ పరుగులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్మలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

మణిరత్నం సోదరుడు చనిపోయిన 22 యేళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు

ట్రంప్ ఫోన్ కాల్‌ని లిఫ్ట్ చేయని ప్రధాని మోడి?, ట్రంప్ నెత్తిపైన టారిఫ్‌ల తాటికాయ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments