Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : భారత్ గెలవాలంటూ పాక్ ఆటగాళ్ళ ప్రార్థనలు

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (09:43 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం సూపర్-12, గ్రూపు బిలో భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచితీరాలంటూ పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు.. ఆ దేశ క్రికెట్ అభిమానులు కోరుకుంటూ, ప్రార్థనలు చేస్తున్నారు. దీనికి ఓ కారణం లేకపోలేదు. 
 
పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు భారత్, జింబాబ్వే జట్లతో మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌లలో ఆ జట్టు ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అదేసమయంలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లపై భారత్ గెలిస్తే పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు చేజారిపోతాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ ఖచ్చితంగా గెలవాలంటూ పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రార్థనలు చేస్తున్నారు. అంతేకాదండోయ్.. జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లపై కూడా విజయం సాధించాలని కోరుకుంటుంది. 
 
మరోవైపు, పాకిస్థాన్ జట్టు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లతో ఆడాల్సివుంది. వీటిలో ఆదివారం క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గనుక పాకిస్థాన్ ఓడితే మాత్రం ఆ జట్టు నేరుగా ఇంటికి చేరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

తర్వాతి కథనం
Show comments