తొలి టెస్ట్‌లో దారుణ పరాజయం దిశగా టీమిండియా

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (12:04 IST)
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో దారుణ పరాజయం దిశగా అడుగులు వేస్తోంది టీమిండియా. చివరి రోజు తొలి సెషన్‌లో మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. దీంతో లంచ్ సమయానికి కోహ్లి సేన 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కోహ్లి (45), అశ్విన్ (2) ఉన్నారు. చివరి రోజు ఆండర్సన్ ధాటికి ఇండియన్ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 
 
గిల్ (50) హాఫ్ సెంచరీ చేయగా.. పుజారా (15), రహానే (0), రిషబ్ పంత్ (11), వాషింగ్టన్ సుందర్ (0) విఫలమయ్యారు. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. ఒక దశలో లంచ్‌కు ముందే ఆలౌటవుతారా అని అనిపించింది. అయితే కోహ్లి, అశ్విన్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 3, లీచ్ 2, బెస్ 1 వికెట్ తీశారు. అయితే మరో రెండు సెషన్ల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments