Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాకిస్థాన్ సమరం.. హాట్ కేకుల్లా అమ్ముడుబోయిన టిక్కెట్లు

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (08:51 IST)
ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మరోమారు తలపడనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన టికెట్ల విక్రయం సోమవారం ప్రారంభం కాగా, దాయాదుల మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గంటలోపే టికెట్లు అన్నీ ఖాళీ అయిపోయాయి. 
 
ఈ ఏడాది అక్టోబరు 16 నుంచి నవంబరు 13 మధ్య ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అక్టోబరు 23న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఫైనల్‌తో మొత్తం 45 మ్యాచ్‌ల టికెట్లను కూడా విక్రయానికి ఉంచారు. అడిలైడ్, బ్రిస్బేన్, జీలాంగ్, హాబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలలో మ్యాచ్‌లు జరుగుతాయి.
 
తమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకుండా కేవలం ఐసీసీ టోర్నమెంట్లలోనే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దీంతో ఈ రెండు జట్లు ఆడే మ్యాచ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ప్రపంచకప్ టిక్కెట్లను ఫైనల్‌తో సహా మొత్తం 45 మ్యాచ్‌ల టికెట్లను అధికారులు విక్రయానికి ఉంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12ఏళ్లు డ్యూటీ చేయని కానిస్టేబుల్.. జీతం మాత్రం రూ.28లక్షలు తీసుకున్నాడు..

Amarnath Yatra: నాలుగు రోజుల్లో అమర్‌నాథ్ యాత్రలో 70,000 మంది భక్తులు

ఏపీలో కుక్కను.. తెలంగాణాలో ఎద్దును ఢీకొన్న వందే భారత్ రైళ్లు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments