Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

1000వ వన్డేలో భారత్ ఘన విజయం - విండీస్ చిత్తు

1000వ వన్డేలో భారత్ ఘన విజయం - విండీస్ చిత్తు
, ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (19:57 IST)
అహ్మదాబాద్ వేదికగా భారత్ ఆడిన 1000వ వన్డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి వెస్టిండీస్ జట్టును టీమిండియా చిత్తుగా ఓడించింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఇది భారత్ ఆడిన 1000వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. 
 
తొలుత ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన విండీస్ 43.5 ఓవర్లలో కేవలం 176 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్లు చహల్ (4/49), సుందర్ (3/30)లు అద్భుతమైన బౌలింగ్‌తో కరేబియన్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టారు. 
 
అయితే, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ బాధ్యతాయుతంగా ఆడి అర్థ సెంచరీ నమోదు చేశారు. హోల్డర్ 71 బంతుల్లో 57 పరుగులు చేయగా, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు అలెన్ (29) సహకారంతో కివీస్ 150 పరుగుల స్కోరును దాటింది. 
 
ఆ తర్వాత 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... 132 బంతులు, 6 వికెట్లు మిగిలివుండగానే విజయం సాధించింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (60), ఇషాన్ కిషన్ (28), విరాట్ కోహ్లీ (8), రిషబ్ పంత్ (11), సూర్యకుమార్ 34 (నాటౌట్), దీపక్ హూడా 26 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. అదనంగా మరో 11 పరుగులు వచ్చాయి. దీంతో నాలుగు వికెట్ల నష్టానికి 28 ఓవర్లలో 178 పరుగులు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సురేష్ రైనా తండ్రి త్రిలోక్ చంద్ రైనా కన్నుమూత