Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకింగ్స్.. మూడో స్థానానికి పడిపోయిన భారత్.. కారణం?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (16:03 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ సేన అగ్రస్థానాన్ని కోల్పోయింది. ఇందుకు అత్యధికంగా టెస్టు సిరీస్‌లు ఆడకపోవడమే కారణం. తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 116 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో, న్యూజిలాండ్ 115 పాయింట్లతో రెండవ స్థానంలో వుంది. ఇక టీమిండియా 114  పాయింట్లతో మూడవ స్థానంలోకి పడిపోయింది. 
 
అక్టోబర్ 2016 తరువాత భారతదేశం మొదటిసారిగా అగ్రస్థానంలో నిలిచింది. దీనికి కారణం భారతదేశం 12 టెస్టుల్లో గెలిచి, 2016-17లో కేవలం ఒక టెస్టులో ఓడిపోయింది. ఈ మధ్యలో భారత్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో సహా మొత్తం ఐదు సిరీస్‌లను గెలుచుకుంది. 
 
మరోవైపు, ఆస్ట్రేలియా అదే సమయంలో దక్షిణాఫ్రికాతో పాటు భారత్‌తోనూ ఓడిపోయింది. భారత్ 2016 అక్టోబర్‌లో అగ్రస్థానాన్ని చేపట్టినప్పటి నుండి 42 నెలలు టెస్టుల్లో నెం-1గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ జైత్ర యాత్ర ముగిసింది.

సంబంధిత వార్తలు

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments