Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను కట్టడి చేసిన ఇంగ్లండ్ బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితం

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (18:29 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా, ఆదివారం లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ను ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లండ్ ముంగిట 230 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారత ఆటగాళ్ళలో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ మాత్రమే రాణించారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కాగా, మిగిలిన ఆటగాళ్ళు రెండు అంకెల స్కోరు కూడా చేయలేక పోయారు. దీంతో భారత్ తక్కువ స్కోరుకే ఇన్నింగ్స్ ముగించింది. 
 
కెప్టెన్ రోహిత్ శర్మ 87, కేఎల్ రాహుల్ 39, సూర్య కుమార్‌లు 49 చొప్పున పరుగులు చేయగా, కోహ్లీ 0, గిల్ 9, శ్రేయాస్ అయ్యర్ 4, జడేజా 8 చొప్పున మాత్రమే పరుగులు చేశారు. గత మ్యాచ్‌లలో దారుణ ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, డేవిడ్ విల్లీ 3, క్రిస్ వోక్స్ 2, అదిల్ రషీద్ 2, మార్క్ ఉడ్ ఒక్కో వికెట్ చొప్పున తీసి భారత్ వెన్ను విరిచారు. 
 
లక్నో పిచ్‌పై బౌన్స్, కొద్దిగా స్వింగ్ లభించడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని అద్భుతంగా రాణించారు. బ్యాటర్లు ధాటిగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ పదునైన బంతులు విసరడంతో అది సాధ్యం కాలేదు. అదేసమయంలో ఇంగ్లండ్ ఫీల్డింగ్ కూడా మెరుగు పడటంతో భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments