Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ : విజేతకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (16:25 IST)
ఈ నెల 19వ తేదీ నుంచి పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో విజేతకు భారీ మొత్తంలో నగదు బహుమతి అందజేయనున్నారు. ఈ ప్రైజ్ మనీపై ఐసీసీ శుక్రవారం అధికారిక ప్రకటన వెలువరించింది. టోర్నీ ఫైనల్ విజేతగా నిలిచే జట్టుకు ఏకంగా రూ.20.80 కోట్ల మేరకు నగదు బహుమతిని అందజేయనున్నారు. అలాగే, రన్నరప్ జట్టుకు రూ.10.40 కోట్లు, సెమీస్ చేరిన జట్లకు రూ.5.20 కోట్లు ఇవ్వనున్నారు. 
 
ఇక నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్టుకు తలా రూ.3 కోట్లు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.1.20 కోట్లు అందుకోనున్నాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.29 లక్షల అదనంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో విజేత జట్టుకు రూ.14.18 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.7 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ ఇచ్చారు. 
 
కాగా, ఈ దఫా జరిగే టోర్నీలో భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత 23వ తేదీన దాయాది దేశం, చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌తో తలపడుతుంది. మార్చి ఒకటో తేదీన న్యూజిలాండ్ జట్టుతో రోహిత్ సేన ఆడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments