Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారంతా ఐపీఎల్‌కు దూరంగా ఉండాలి : రవిశాస్త్రి

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (14:52 IST)
ఐసీసీ ప్రపంచ కప్ పోటీలకు సమయం సమీపిస్తుంది. కానీ, భారత శిబిరంలో గాయాల బెడద ఆందోళన కలిగిస్తుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్‌ పంత్ ఎప్పటికి కోలుకుంటాడనే దానిపై స్పష్టత లేదు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా, శ్రేయస్ అయ్యర్‌ అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశముంది.
 
ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో స్టార్‌ ఆటగాళ్లలందరూ ఆడనున్నారు. ఈ సమయంలో వీరంతా తమ ఫిట్నెస్‌ కాపాడుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి బీసీసీఐకి కీలక సూచన చేశాడు. ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని కీలక ఆటగాళ్ల మ్యాచ్‌ల భారాన్ని తగ్గించేందుకు  ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలతో బీసీసీఐ, ఆటగాళ్లు మాట్లాడాలని చెప్పాడు. అవసరమైతే ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకూడదని సూచించాడు.
 
'కీలక ఆటగాళ్లు గాయాల బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మేం క్రికెట్‌ ఆడినప్పుడు ఇన్ని సదుపాయాలు లేవు. అయినా, 8-10 సంవత్సరాలు సులభంగా ఆడటం మీరు చూశారు. చాలా మంది ఏడాదిలో 8-10 నెలల పాటు ఆడేవారు. ప్రస్తుతం అప్పటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లీగ్‌ల్లో ఆటగాళ్లు భాగం కావడంతో వారి విశ్రాంతి సమయం తగ్గుతోంది. బీసీసీఐ, ఆటగాళ్లు కూర్చొని చర్చించుకోవాలి. మీకు క్రికెట్‌ చాలా అవసరం. అదేసమయంలో విశ్రాంతి కూడా ముఖ్యం. అవసరమైతే ఐపీఎల్‌లో ఆడకండి. బీసీసీఐ బాధ్యత తీసుకుని.. 'ఈ ఆటగాళ్లు మాకు కావాలి. భారత్‌కు వీరి సేవలు అవసరం. వారు ఈ మ్యాచ్‌లు (ఐపీఎల్‌) ఆడకపోతే బాగుంటుంది' అని ఫ్రాంచైజీలతో చెప్పాలి" అని రవిశాస్త్రి వివరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Teachers Day: టీచర్స్ డే- ఉపాధ్యాయులకు బహుమతులు పంపిన పవన్ కల్యాణ్

హైదరాబాద్‌లో మైక్రో బ్రూవరీలు- హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఇక బీర్, వైన్

Dallas: డల్లాస్‌లో గణేష్ చతుర్థి వేడుకలు.. డ్యాన్స్ ఇరగదీశారు.. వీడియో వైరల్

Kavitha: కవితను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పార్టీ?

Chandrababu: అనంతపురంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు.. రాయలసీమకు ప్రత్యేక ఆకర్షణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allari Naresh,: అల్లరి నరేష్, రుహాని శర్మ థ్రిల్లర్ డ్రామా గా ఆల్కహాల్

Madrasi Review: మురుగదాస్ మదరాసి ఎలా వుందో తెలుసా.. మదరాసి రివ్యూ

అనుష్క, క్రిష్ సినిమా ఘాటీ ఎలా ఉందంటే? రివ్యూ

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

తర్వాతి కథనం
Show comments