Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం : బీసీసీఐ చీఫ్ గంగూలీ

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (15:37 IST)
భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా అది అతని వ్యక్తిగతమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. "ఇది పూర్తిగా విరాట్ వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది. విరాట్ సారథ్యంలోని అన్ని ఫార్మెట్లలో భారత్ క్రికెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. భవిష్యత్‌లోనూ ఈ జట్టును మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలోనూ విరాట్ కోహ్లీ కీలక సభ్యుడుగా ఉంటాడు. విరాట్ అద్భుత ఆటగాడు. వెల్డన్" అంటూ గంగూలీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, ఇటీవల వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీని బీసీసీఐ తప్పించింది. అతని స్థానంలో రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇపుడు బీసీసీఐకు - కోహ్లీకి మధ్య బహిరంగ వార్ జరిగింది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవద్దని తాము కోరామని గంగూలీ చెప్పగా, దాన్ని కోహ్లీ ఖండించారు. అలాగే, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే సమయంలో కూడా గంట ముందు మాత్రమే తనకు సమాచారం ఇచ్చారని కోహ్లీ ఆరోపించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

తర్వాతి కథనం
Show comments