Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాష్ టోర్నీలో ఆడే తొలి భారత క్రికెటర్ ఎవరో తెలుసా?

ఆస్ట్రేలియాలో జరుగనున్న బిగ్‌బాష్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మహిళల ట్వంటీ-20 పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ థండర్స్ జట్టు కోసం భారత క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రాతి

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2016 (16:53 IST)
ఆస్ట్రేలియాలో జరుగనున్న బిగ్‌బాష్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మహిళల ట్వంటీ-20 పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ థండర్స్ జట్టు కోసం భారత క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రాతినిథ్యం వహించనున్నారు. దీన్ని సిడ్నీ జట్టు యాజమాన్యం ధ్రువీకరించింది.

వచ్చే డిసెంబర్-జనవరిలో జరిగే క్రికెట్ సిరీస్‌ల్లో హర్మన్ ప్రీత్ కౌర్ సిడ్నీ థండర్స్ తరపున బరిలోకి దిగనుంది. తద్వారా విదేశీ గడ్డపై జరిగే స్వదేశీ టోర్నీలో ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు సాధించింది.
 
ఇదిలా ఉంటే మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డయానా ఎడుల్జి మాట్లాడుతూ..  బీసీసీఐ ఐపీఎల్ లాంటి క్రికెట్ టోర్నీలు మహిళల కోసం నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. భారత మహిళా క్రికెట్‌ను అభివృద్ధి పరిచేందుకు బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక భారత్ తరపున తొలి మహిళా క్రికెటర్ ఆస్ట్రేలియా స్వదేశీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

పాకిస్థాన్‌కు ఎమ్మెల్యే మద్దతు.. బొక్కలో పడేసిన పోలీసులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments