Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీవై పాటిల్ టీ20 టోర్నీ : సిక్సర్ల వర్షం కురిపించిన హార్దిక్ పాండ్య

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (20:23 IST)
ముంబై వేదికగా డీవై పాటిల్ ట్వంటీ20 టోర్నీ జరుగుతోంది. ఇందులో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పగటిపూటే బౌలర్లకు చుక్కలు చూపిస్తా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫలితంగా కేవలం 55 బంతుల్లోనే 158 పరుగుల చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 
 
డీవై పాటిల్ ట్వంటీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం బీపీసీఎల్ జట్టుతో రిలయన్స్-1 టీమ్ తలపడింది. ఇందులో రిలయన్స్ టీమ్-1కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 
 
ఇటీవలే కాగ్ జట్టుపై 39 బంతుల్లో 105 పరుగులు చేసిన పాండ్య, శుక్రవారం కూడా బీపీసీఎల్ జట్టుపై ఏకంగా 55 బంతుల్లో అజేయంగా 158 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో 20 సిక్సర్లున్నాయంటే పాండ్య ఊచకోత ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
 
భారత ప్రధాన జట్టులో ప్రధాన ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్ పాండ్య గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇపుడు గాయం నుంచి కోలుకున్న హార్దిక్... పూర్తి ఫిట్నెస్ సాధించి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ముఖ్యంగా, స్వదేశంలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి ముందు హార్దిక్ మెరుపుదాడులు క్రికెట్ పండితులను విస్మయానికి గురిచేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments