Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛోట్టోగ్రామ్ టెస్ట్ : బంగ్లాదేశ్ ముంగిట భారీ టార్గెట్

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (16:10 IST)
ఛోట్టోగ్రామ్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 513 విజయలక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముంగిట ఉంచింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు 513 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. శుక్రవారం ఆటకు మూడో రోజు. ఇంకా రెండు రోజుల ఆట ముగిలివుంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం స్పష్టంగా రానుంది. 
 
ఇదిలావుంటే, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు బాదారు. ఓపెనర్ గిల్ 110 పరుగులు చేయగా, పుజారా 102 పరుగులు చేశారు. పూజారా శతకం పూర్తి చేయగానే జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. కోహ్లీ 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 
 
బంగ్లాదేశ్ ముంగిట టార్గెట్ 500కుపై ఉండటంతో బంగ్లాదేశ్ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్ విజయం ఖాయంగా కనిపిస్తుంది. ఆటకు మరో రెండు రోజుల సమయం ఉండటంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు 200 ఓవర్లు ఆడేది అనుమానమే. అందువల్ల ఫలితం తేలనుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments