అటువైపు ఎవరున్నా తగ్గేదేలే.. గౌతం గంభీర్

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (13:31 IST)
టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్-గౌతమ్ గంభీర్ ఇటీవల వార్తల్లో నిలిచారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023లో భాగంగా ఇటీవల సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 
 
ఈ సందర్భంగా గంభీర్, శ్రీశాంత్ మైదానంలో ఒకరినొకరు వాగ్వాదానికి దిగారు. గంభీర్ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సహచరులను ఎలా గౌరవించాలో గంభీర్‌కు తెలియదని ఆరోపించారు.
 
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ, లక్నో సూపర్‌జెయింట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి ఘర్షణే చోటుచేసుకుంది. కోహ్లితో నవీనుల్ హక్, గంభీర్ వాగ్వాదానికి దిగారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. 
 
తాజాగా ఈ ఘటనపై గంభీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. మ్యాచ్ మధ్యలో జోక్యం చేసుకునే హక్కు తనకు లేదని, అయితే మ్యాచ్ ముగిసే సమయానికి వెళ్లి తన ఆటగాళ్లతో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అటువైపు ఎవరున్నా తగ్గేదేలే.. తమ ఆటగాళ్లను కాపాడుకోవడం తమ బాధ్యత అని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments