Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విరాట్ కోహ్లీని ఓదార్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. జెర్చీని బహుకరించిన కోహ్లీ

kohli - maxwell
, సోమవారం, 20 నవంబరు 2023 (17:11 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సమరం ముగింది. ఆదివారం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో భావోద్వేగ సన్నివేశాలు నెలకొన్నాయి. మైదానంలో విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓదార్చారు. ఈ సందర్భంగా మ్యాక్స్‌వెల్‌కు కోహ్లీ తన జెర్సీని బహుమతిగా అందజేశాడు.
webdunia
 
మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ వద్దకు వచ్చిన మ్యాక్స్‌వెల్ ఆత్మీయంగా మాట్లాడారు. ఓటమి బాధలో ఉన్న కోహ్లీని ఓదార్చాడు. అంతేకాకుండా కోహ్లీ నుంచి గుర్తుగా ఓ జెర్సీని కూడా తీసుకున్నాడు. ఈ ఎమోషన్ మూమెంట్స్‌ను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
webdunia
 
కాగా, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండటం తెలిసిందే. ఐపీఎల్‌లో పలు జట్లకు ఆడిన మ్యాక్స్‌వెల్ 2021 నుంచి ఆర్బీసీ తరపున ఆడుతున్నాడు. బెంగుళూరు జట్టుకు మారిన తర్వాత అతని ఆటతీరులో కూడా మార్పు వచ్చి స్థిరంగా రాణిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటమి భారంతో కుంగిన మహ్మద్ షమీని అక్కున చేర్చుకున్న ప్రధాని మోదీ