Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయ కండువా కప్పుకున్న గంభీర్ - మోడీ విధానాలు నచ్చే చేరాను

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (17:15 IST)
గౌతం గంభీర్.. ఢిల్లీకి చెందిన ఈ మాజీ క్రికెటర్ కాషాయ కండువా కప్పుకున్నారు. దేశవ్యాప్తంగా తన ఆటతీరుతో ఎందరో అభిమానులను దక్కించుకున్నారు. దేశ రక్షణలో అమరులైన పలువురు జవాన్ల పిల్లలను దత్తత తీసుకున్నారు. మరికొందరి పిల్లల విద్యకు అయ్యే మొత్తం ఖర్చును భరించనున్నాడు. ఇలా క్రికెటర్‌ కంటే.. తన ఛారిటీ కార్యక్రమాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైడ్లీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గంభీర్‌ను ఢిల్లీలోని ఓ స్థానం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో చేరిన అనంతరం మాట్లాడిన గౌతమ్ గంభీర్.. ప్రధాని మోడీ నిర్ణయాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. తనకు పార్టీలో చేరే అవకాశం ఇచ్చినందుకు గౌరవంగా భావిస్తున్నానని గంభీర్‌ తెలిపారు. 
 
దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై స్పందించిన గంభీర్, ఇటీవల పుల్వామా ఉగ్రదాడి అంశంలో కూడా పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టారు. బీజేపీలో చేరిన ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామంటూ బీజేపీ కూడా చెబుతుంది. పార్టీ సెలక్షన్ కమిటీ గంభీర్‌కు ఎటువంటి బాధ్యతలు అప్పగించాలనే విషయంపై సమాలోచనలు జరుపుతుందని చెప్పారు. ఇటీవలే గంభీర్‌కు పద్మా పురస్కారం కూడా లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

తర్వాతి కథనం
Show comments