ఐపీఎల్ సిక్సర్లు : భారత తొలి ఆటగాడిగా ధోనీ రికార్డు!

ఠాగూర్
సోమవారం, 31 మార్చి 2025 (18:21 IST)
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో అదిరిపోయే రికార్డు సాధించాడు. 30 యేళ్ల నిండిన తర్వాత ఐపీఎల్‌లో 200 సిక్స్‌లు బాదిన తొలి భారత అటగాడిగా నిలిచాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుషార్‌ దేశ్‌పాండే వేసిన 19 ఓవర్‌లో సిక్స్ బాదడం ద్వారా ధోనీ ఈ ఫీట్ సాధించాడు. 
 
ఓవరాల్‌గా ఈ జాబితాలో ధోనీ రెండో స్థానంలో ఉండగా, క్రిస్‌గేల్ (347 సిక్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్ళ విషయానికొస్తే.. ధోనీ తర్వాత రోహిత్ శర్మ (113), అంబటి రాయుడు (109), దినేశ్ కార్తిక్ (104) మాత్రమే 30 యేళ్లు నిండిన తర్వాత 100 కంటే ఎక్కువ సిక్సర్లు బాదారు. 
 
ప్రస్తుతం ధోనీ వయసు 43 యేళ్లు, అయినప్పటికీ ఫిట్నెస్‌ను కాపాడుకుంటూ ఐపీఎల్‌లో తన కేరీర్‌ను కొనసాగిస్తున్నాడు. పూర్తిస్థాయి వికెట్‌కీపర్‌గా ఉంటూ మెరుపు స్టంపింగ్స్ చేస్తున్నాడు. బ్యాటింగ్‌లో మాత్రం మునుపడి జోరును ప్రదర్శించిలేకపోతున్నాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఏడో స్థానంలో వచ్చిన ధోనీ 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అటు సీఎస్కే కూడా ఈ సారి ఆకట్టుకోలేకపోయింది. తొలి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన చెన్నై తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌‍లలో ఓడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amritsar: పంజాబ్‌లో గరీబ్‌రథ్ రైలులో అగ్ని ప్రమాదం.. మహిళకు తీవ్రగాయాలు (video)

Varma: చంద్రబాబు ఆగమంటే ఆగుతా.. దూకమంటే దూకుతా: పిఠాపురం వర్మ (video)

Pawan Kalyan: మనం కోరుకుంటే మార్పు జరగదు.. మనం దాని కోసం పనిచేసినప్పుడే మార్పు వస్తుంది..

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

తర్వాతి కథనం
Show comments