Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈసీబీ ప్రతిపాదనను తిరస్కరించిన బీసీసీఐ - పీసీబీ

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (16:00 IST)
దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌కు తాము ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా వద్ద ఓ ప్రతిపాదన చేసింది. 
 
క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు చివరిగా గత 2007లో టెస్ట్ మ్యాచ్ జరిగింది. అయితే, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రాజకీయ కారణాల రీత్యా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లకు అవకాశం లేకుండా పోయింది. 2013 నుంచి కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. 
 
అయితే, ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుంది. జట్టు వెంట ఈసీబీ డిప్యూటా ఛైర్మన్ మార్టిన్ డార్లో కూడా ఉన్నారు. ఈయన పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా వద్ద ఓ ప్రతిపాదన చేశారు. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌కు తటస్థ వేదికగా ఇంగ్లండ్ నిలుస్తుందనే ప్రతిపాదన చేశారు. అయితే, దీనికి రమీజ్ రాజా సమాధానం ఏంటన్నది తెలియాల్సివుంది. 
 
ఈ ప్రతిపాదనను జట్టు కెప్టెన్ మొయిన్ అలీ స్పందించారు. ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్‌కు ఇంగ్లండ్ వేదిక అయితే అది అద్భుతమే అవుతుందని చెప్పారు. క్రికెట్ ప్రపంచంలో రెండు మేటి జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడటం, ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడకపోవడం సిగ్గుచేటని చెప్పుకొచ్చారు. 
 
ఈసీబీ వైస్ ఛైర్మన్ చేసిన ప్రతిపాదనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పందించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగబోదని, అది తటస్థ వేదిక అయినా, మరో వేదిక అయినా సరే సాధ్యపడే విషయం కాదని పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

తర్వాతి కథనం
Show comments