Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీని కిడ్నాప్ చేశారా? నిజమేనా? డిషూమ్ సంగతేనా?

Webdunia
మంగళవారం, 31 మే 2016 (17:56 IST)
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కిడ్నాప్ గురించి ముంబైలో జోరుగా ప్రచారం సాగుతోంది. అతడిని కిడ్నాప్ చేశారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. విరాట్ కోహ్లీ మనస్తత్వంపై బాలీవుడ్‌లో డిషూమ్ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో కోహ్లీని పోలి వున్న క్రికెటర్ పాత్రలో సకీబ్ సలీమ్ నటిస్తున్నాడు. మరో ప్రధాన పాత్రలో జాన్ అబ్రహాం నటిస్తున్నాడు. 
 
ఈ సినిమాలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి ఆకట్టుకునే.. జట్టుకు విజయాన్ని సమకూర్చగలిగే క్రికెటర్‌గా సకీబ్ కనబడుతున్నాడని తెలిసింది. ఈ సినిమాను సాజిద్‌ నడియవాలా నిర్మాణంలో డేవిడ్‌ ధావన్‌ తెరకెక్కిస్తున్నాడు. 
 
అధికారికంగా చెప్పకపోయినా అది కోహ్లీ స్ఫూర్తిగా తెరకెక్కుతుందని చెప్పాలి. సకీబ్ కూడా కోహ్లీని పోలిన పాత్రలో మెప్పిస్తాడని తెలుస్తోంది. ఇక, తాజా విషయమేమిటంటే ఈ సినిమాలో విరాట్‌ పాత్రధారి సకీబ్‌ కిడ్నాప్‌నకు గురవుతాడట. జాన్‌ అబ్రహం అతణ్ని కిడ్నాప్‌ చేస్తాడట. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments